వైసీపీకి షాక్.. టీడీపీలోకి మరో కీలక నేత

-

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసిపి పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళగా.. తాజాగా మరో వైసిపికి పార్టీకి చెందిన నేత టిడిపిలోకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేష్ ను వైసీపీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకియ ఖానమ్ కలిశారు.ఇప్పటికే మంత్రి ఫరూఖ్ తో జాకియ ఖానమ్ భేటీ అయ్యారు.జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభల్ని బాహీష్కరించినా కూడా , మండలి కి జాకియ ఖానమ్ వస్తున్నారు.ఇవాళ లోకేష్ కి కుటుంబసభ్యులతో కలిసి జాకియ ఖానమ్ పుష్పగుచ్ఛం ఇచ్చారు.త్వరలో తెలుగుదేశం లో జాకియ ఖానమ్ చేరుతున్నారంటూ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version