బొత్సకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే !

-

పంచాయతీ ఎన్నికల వేళ నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో బొత్సా కుటుంబ సభ్యులు అయిన ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స లక్షణరావులు రెండు వర్గాలుగా విడిపోయారు. మంత్రి బొత్స సోదరుడు లక్షణరావు పై ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. టీడీపీతో కుమ్మకై పార్టీని దెబ్బ తీస్తున్నారని ఆయన ధ్వజం ఎత్తారు.

అన్నకి, వదినకి, మరో సోదరుడికి పదవులున్నా చాలక, లక్ష్మణ రావు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారంటూ మండి పడ్డారు. మంత్రి బొత్సకి పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అందుకే ఎమ్మేల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అధిష్టానంకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. డబ్బులు ఎక్కువైతే దాన ధర్మాలు చేయాలి తప్ప, సొంత పార్టీలో చిచ్చు పెడతారా అంటూ మండిపడినట్టు చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యే బడ్డుకొండ వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర రాజకీయ చర్చకు దారి తీశాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version