షాకింగ్: కర్ణాటక సీఎం కోసం పోటీలోకి మరొక్కరు !

-

కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే కర్ణాటక సీఎం ను సిద్దరామయ్య మరియు డీకే శివకుమార్ లలో ఎవరిని ఎన్నుకోవాలి అన్న మతలబులో ఉంటే తాజాగా మరో సమస్య వారిని ఇరకాటంలో పడేసింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం కర్ణాటక సీఎం పదవి కోసం వీరిద్దరూ కాకుండా మరొక్కరు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని లింగాయత్ కులానికి చెందిన ఆలిండియా వీరశైవ మహాసభ కాంగ్రెస్ అధిష్టానానికి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ లేక రాసిందట. ఈ లేఖలో ఈ ఎన్నికల్లో అసెంబ్లీ కి ఎంపికయిన ఎమ్మెల్యే లలో 34 మంది మా సామాజికవర్గానికి చెందిన వారు మరియు కర్ణాటకలోని నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలుపుకి సాధించింది అంటే అందుకు కారణం మా లింగాయత్ సామాజిక వర్గం అంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించే విధంగా లేక రాసింది.

ఇప్పుడు సీఎం రేస్ ఆసక్తికరంగా మారే అవకాశం లేకపోలేదు. ఆలస్యం అయితే బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడే ఛాన్స్ ఉంది. కాగా కాంగ్రెస్ అధిష్టానం ఏమి చేయనుంది ? సీఎం గా ఎవరిని ప్రకటించనుంది అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news