ఎల్లారెడ్డిగూడలో దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య

-

నగరంలోని ఎల్లారెడ్డిగూడలో భార్యాభర్తలు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. మద్యం మత్తులో భర్త భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి గూడలో భార్యా(ప్రేమలత 35), భర్త (జనార్ధన్ 40) మృతి చెందారు.

మద్యం మత్తులో భార్యను ఇనుపరాడుతో కొట్టి చంపాడు భర్త జనార్ధన్. భార్యనుచంపి ఇంటిలోని హాలులో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు భర్త జనార్ధన్. గత రాత్రి తూముకుంటలో జనార్దన్ భార్య ప్రేమలత ఓ పెళ్లిరోజు ఫంక్షన్ కి వెళ్లి వచ్చారు. ఫంక్షన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అర్ధరాత్రి మద్యం మత్తులో భార్యను చంపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఎస్అర్ నగర్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news