SHOCKING NEWS : నేలరాలిన దర్శక దిగ్గజం రాజ్ కుమార్ కోహ్లీ !

-

సినీ పరిశ్రమలో వరుస పెట్టి విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దుఃఖాన్ని మిగిల్చే ఘటన ఒకటి జరిగింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ కోహ్లీ కాసేపటి క్రితమే అందరినీ వదిలేసి అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. ఈ వార్త తెలియగానే బాలీవుడ్ అంతటా విషాదం నెలకొంది. రాజ్ కుమార్ కోహ్లీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. ఇక ఈ రోజు ఉదయం ముంబై లోని తన నివాసంలో గుండెపోటు కారణంగా మరణించారు. రాజ్ కుమార్ కోహ్లీ ఒక డైరెక్టర్ గా సన్నీ డియోల్, సునీల్ దత్, మిథున్ చక్రవర్తి, అనిల్ కపూర్ లాంటి అగ్రనటులతో సినిమాలు తెరకెక్కించారు.

ఈయన తీసిన సినిమాలలో జానీ దుష్మన్, నాగిన్, రాజ్ తిలక్, విరోధి, కహార్ లాంటి సినిమాలు చాలా పేరును సంపాదించి పెట్టాయి. కేవలం హిందీలోనే కాకుండా పంజాబీ సినిమాలను సైతం తెరకెక్కించిన ఘనా రాజ్ కుమార్ కు దక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news