దుర్గా నిమజ్జనంలో కాల్పులు…!

-

బీహార్‌ లోని ముంగేర్ నగరంలో దుర్గా విగ్రహం నిమజ్జనం సందర్భంగా సోమవారం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సదర్ ఆసుపత్రి మరియు ఇతర ప్రైవేట్ ఆసుపత్రులలో చేర్చారు. ముంగేర్‌ లో సోమవారం జరిగిన విగ్రహ నిమజ్జనం కార్యక్రమంలో కాల్పుల సంఘటన తర్వాత బీహార్ పోలీసులు 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు.

అక్కడి నుంచి 12 బులెట్ లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంగేర్‌లో జరిగిన విగ్రహ నిమజ్జనం సందర్భంగా గందరగోళం చెలరేగడంతో, జనంలో కొంతమంది కాల్పులు జరిపారని పోలీసులు పేర్కొన్నారు. ఇందులో ఒక వ్యక్తి మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. కాల్పుల సంఘటనలో పోలీసులు 100 మందిని ప్రశ్నించి, అదుపులోకి తీసుకున్నారు. మూడు దేశీయ పిస్టల్‌ లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news