“ది గ్రేట్ కోహ్లీ”కి షాక్ ఇచ్చిన యంగ్ ప్లేయర్

-

ఆసియా కప్ కోసం శ్రీలంక బయలుదేరి వెళ్లనున్న టీం ఇండియా జట్టుకు బెంగుళూరు లోని ఆలూరు శిక్షణ శిబిరంలో బీసీసీఐ ఆధ్వర్యంలో ఫిటినెస్ పరీక్షలను నిర్వహించారు. అందులో భాగంగా పెట్టిన యోయో టెస్ట్ లో అందరూ నెగ్గగా, అందరికన్నా ఎక్కువ ఫిట్ గా నిలిచి ఒక యంగ్ ప్లేయర్ రికార్డ్ సాధించాడు. మాములుగా ఇప్పుడు ఉన్న క్రికెటర్ లలో ఎక్కువ ఫిటినెస్ ను కలిగిన ఉన్న ఆటగాడిగా విరాట్ కోహ్లీకి పేరుంది. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ ని దాటేసి షాక్ ఇచ్చాడు. ముందుగా విరాట్ కోహ్లీ యోయో టెస్ట్ లో పాల్గొనగా అతనికి 17 .2 పాయింట్లు వచ్చాయని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అనంతరం శుబ్మాన్ గిల్ యోయో టెస్ట్ లో పాల్గొనగా ఇతనికి 18 .7 పాయింట్లు వచ్చాయి. దీనితో అందరూ షాక్ కు గురయ్యారు, ముఖ్యంగా కోహ్లీకి ఈ విషయం మింగుడు పడనిదని చెప్పాలి.

ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతోంది. ఇక మిగిలిన ఆటగాళ్లు అందరూ కూడా యోయో టెస్ట్ కట్ అఫ్ పాయింట్స్ 16.5 దాటారని బీసీసీఐ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news