మీ నోటికి తాళం వేసుకోండి.. సీఎం చంద్రబాబుకు అంబటి కౌంటర్

-

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి నేతలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మొన్నటివరకు ఏపీలోని విజయవాడలో బుడమేరు వరదలకు చంద్రబాబే కారణమని మాజీ సీఎం జగన్, వైసీపీ కీలక నేతలు ఆరోపించారు.బుడమేరు గేట్లు ఎత్తకపోతే కృష్ణా నది కరకట్టపై నిర్మించిన చంద్రబాబు నివాసం మునిగిపోతుందని.. అందుకే బుడమేరు కాలువ గేట్లు ఎత్తారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. దీంతో విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని విమర్శించారు.

తాజాగా సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై వైసీపీ స్పోక్స్ పర్సన్ అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.రాజధాని అమరావతి పై తప్పుడు ప్రచారం చేస్తే నోటికి తాళం వేస్తానన్న సీఎం చంద్రబాబు హెచ్చరికపై మాజీ మంత్రి అంబటి స్పందిస్తూ..‘ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళాలు ఎవరు వేస్తారు? అక్రమంగా ఉన్న మీ ఇంటికి ముందు తాళం వేయండి. అప్పటివరకు మీ నోటికి తాళం వేసుకోండి’ అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news