ఏపీ సర్కారు తరఫున జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు..

-

అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారికి ఏపీ ప్రభుత్వం తరపున కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కుటుంబ సమేతంగా బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ క్రమంలో ఆలయ ఈవో పురేందర్ కుమార్, పాలక మండలి చైర్మన్ నాగేశ్వర రెడ్డి, అర్చకులు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ రంజిత్ బాషా కుటంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పట్టు వస్త్రాలు అందజేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈఓ,చైర్మన్.. కలెక్టర్‌కు తీర్థ ప్రసాదాల అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఏపీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు.అలంపూర్‌తో తనకు విడదీయరాని బంధం ఉందని, తన తల్లి గారిది అలంపూర్ అని ఆయన గుర్తు చేసుకున్నారు.అమ్మవారి కృపా కటాక్షం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండాలని ఆకాంక్షించారు.దేవస్థాన అభివృద్ది గురించి ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు సాయం చేస్తానని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version