బ్రేకింగ్: ఎస్పీ బాలుకి కరోనా పాజిటివ్

-

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో కరోనా పరిక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం చెన్నై లో నివాసం ఉంటున్నారు. అక్కడే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య౦ నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. స్వల్ప లక్షణాలతో ఆయనకు కరోనా వచ్చింది.

ఆయన కుటుంబ సభ్యులు అందరిని సెల్ఫ్ క్వారంటైన్ చేసారు అధికారులు. అదే విధంగా ఆయన సోదరి ఎస్పీ శైలజ కూడా కరోనా పరిక్షలు చేయించుకున్నారు. ఇటీవల తనను కలిసిన వారు అందరూ కరోన పరిక్షలు చేయించుకోవాలి అని ఆయన కోరారు. నిన్న తెలుగు సింగర్ స్మిత కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఆమె భర్త కు కూడా కరోనా రాగా ఆమె ఇప్పుడు హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news