కరోనా నుంచి కోలుకున్న సింగర్‌ సునీత..!

-

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. కొద్ది రోజుల క్రితం తనకు వైరస్ సోకిందని.. అయితే ప్రసుతం దాని నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు సునీత ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. అయితే ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. మరోవైపు ఎస్పీ బాలు కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు సునీత తెలిపింది. అలాగే సింగ‌ర్ మాళ‌విక కూడా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల ఓ టీవి షో కోసం ఏర్పాటు చేసిన సంగీత కార్య‌క్ర‌మంలో సునీత, మాళ‌విక పాల్గొన్నార‌ట‌.

అక్క‌డే వారికి క‌రోనా సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. అంతే కాకుండా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారంతా క‌రోరా బారిన ప‌డిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా, ఇప్పటికే బండ్ల గణేష్, రాజమౌళి, డీవీవీ దానయ్య, తేజ, నాగవంశీ మరికొంత మంది ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version