తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య

-

వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సర్కారు నియమించింది. రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యులుగా సంకేపల్లి సుధీర్‌రెడ్డి,ఎం.రమేశ్‌, నెహ్రూ నాయక్‌ మాలోత్‌ను నియమిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈరోజు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

వీరంతా రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగనున్నారు. సిరిసిల్ల రాజయ్య వరంగల్‌ (ఎస్‌సీ) లోక్ సభ స్థానం నుంచి 15వ లోక్‌సభకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు.ఈ సందర్భంగా అసెంబ్లీలోని పొన్నం కార్యాలయనికి సిరిసిల్ల రాజయ్య శుక్రవారం వచ్చిన సందర్భంగా మంత్రి పొన్నం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news