కేసిఆర్ బర్త్‌ డే కి ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం: సంతోష్‌ కుమార్‌

-

ఫిబ్రవరి 17న బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. కేసీఆర్‌ 70వ పుట్టిన రోజు సందర్భంగా ఒక్కొక్కరూ 3 మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. లెజెండ్‌ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని ఆయన అన్నారు. తెలంగాణ జాతిపితను గౌరవించాలంటే మాతృభూమిని పోషించడం కంటే గొప్ప మార్గం ఏముందని సోషల్ మీడియా వేదికగా సంతోష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

 

ప్రియతమ నాయకుడు కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన మార్గదర్శక నాయకత్వానికి , గౌరవానికి చిహ్నంగా ఉండే వృక్షార్చన ఉద్యమాన్ని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.పెరుగుదల, జీవితం, స్థిరత్వానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి సహచరులతో గర్వంగా సెల్ఫీ తీసుకుంటూ, మార్పు క్షణాన్ని సంగ్రహించాలని అన్నారు.అలాగే 70వ పుట్టినరోజు సందర్భంగా 70 కేజీల భారీ కేక్‌ను కట్‌ చేసి,ఆలయాలు, మసీదులో, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news