ఆ భాగంలో తాకితే నేరం కాదు.. వివాదాస్పదంగా మారిన ముంబై కోర్టు తీర్పు..!

-

ముంబయి హైకోర్టు బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఇటీవల ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి పన్నేండేళ్ల బాలిక ఛాతీభాగంలో తాకాడంతో పాటు ఆ అమ్మాయి శరీరంలోని పలు భాగాలపై చేయివేశాడని ఆరోపిస్తూ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. మైనర్‌ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని పోక్సో చట్టం కింద శిక్షించాలని పిటిషనర్‌ కోరారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పుప్ప గనిడేవాలతో కూడిన ఏకసభ్య ధర్మాసనం తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర తీవ్ర దుమారం రేపాయి.

ఉద్దేశపూర్వకంగా తాకితేనే..

న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇలా.. ‘పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులంటే నిందితుడు బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నించి ఉండాలి.. లేదంటే అతను ఉద్దేశపూర్వకంగా బాలిక ప్రైవేటు భాగాలను తాకాలి. శారీరకంగా వేధింపులకు గురిచేసైనా ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే పోక్సో చట్టం ప్రకారం శిక్షించవచ్చు. కానీ ఈ కేసులో నిందితుడు కేవలం బాలికను డ్రెస్‌పై నుంచి మాత్రమే తాకాడని.. లైంగిక దాడికి పాల్పడినట్టు ప్రయత్నం కూడా చేయలేదు. అంతేకాక బాలిక డ్రస్‌ లోపల చేతులు పెట్టి ఎలాంటి భాగాలనూ తాకలేదు. శరీరం–శరీరం తాకినంత మాత్రాన పోక్సో చట్టం ప్రకారం నేరంగా భావించలేం. దానిని ఐపీసీ 354, 342 (మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, అవమానించడం) వంటి సెక్షన్ల కింద నేరంగా పరిగణించి విచారణ జరపవచ్చు’ అంటూ న్యాయమూర్తి పుష్ప తీర్పు వెలువరించారు. 12 ఏళ్ల బాలిక ఛాతీని డ్రస్‌పై నుంచి తాకినట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ప్రధానంగా పోక్సో చట్టం కింద నమోదైయ్యే కేసుల్లో కచ్చితమైన ఆధారాలు ఉండాలని తీర్పులో పేర్కొన్నారు.

వెల్లువెత్తుతున్న విమర్శలు..

ఈ క్రమంలో ముంబై హైకోర్టు ఇచ్ని తీర్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కాలంలో న్యాయస్థానం వెలువరించిన తీర్పు సరైంది కాదని.. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుపై సినీనటి తాప్సి పన్ను తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి తీర్పులు విన్న తరువాత తనకు మాటలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను. కానీ.. ఇలాంటి తీర్పు విన్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు’ అంటూ తాప్సి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో జూన్‌ పాల్‌ అనే ట్విటర్‌ యూజర్‌ షేర్‌ చేసిన ఓ ట్వీట్‌ను ఆమె రీట్వీట్‌ చేశారు. ఇదే తీర్పుపై గాయని చిన్మయి మరింత ఘాటగా స్పందించారు. జూన్‌ పాల్‌ ట్వీట్‌నే షేర్‌ చేసిన చిన్మయి.. ‘మహిళలు ఎదుర్కొనే చట్టం ఇది. అద్భుతంగా ఉంది కదా.. ఈ దేశం లైగింగ వేధింపులకు పాల్పడే వారికోసమే. వారి కోసం వారే ఏర్పాటు చేసుకున్నది’ అంటూ చిన్మయి తన ట్వీట్‌లో అసహనం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news