త‌న‌పై దాడి చేశారంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించిన స్నేహ‌…!

-

ఇద్ద‌రు వ్యాపార‌వేత్త‌ల‌పై సీనీన‌టి స్నేహ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆ ఇద్ద‌రు వ్యాపార‌వేత్త‌లు కూడా ఓ ఎక్స్ పోర్ట్ కంపెనీని న‌డుపుతున్నారు. వాళ్లిద్ద‌రూ త‌మ కంపెనీలో పెట్టుబ‌డులు పెడితే లాభాలు వ‌స్తాయ‌ని స్నేహ‌ను న‌మ్మించారు. దాంతో వారి మాటల‌ను న‌మ్మిన స్నేహ రూ.26ల‌క్ష‌లు పెట్టుబ‌డిగా పెట్టారు. వాటాలు ఇవ్వ‌క‌గా పోగా తాను పెట్టుబ‌డిగా పెట్టిన 26ల‌క్ష‌ల‌ను కూడా వ్యాపారులు ఇవ్వ‌లేదు. అంతే కాకుండా త‌ను ఇచ్చిన డ‌బ్బుల‌కు వ‌డ్డీ అడిగినా వ్యాపార‌స్థులు చెల్లించ‌లేదు.

sneha files case on two business mans
sneha files case on two business mans

అంతే కాకుండా వ‌డ్డీ డ‌బ్బులు అడిగితే గ‌ట్టిగా మాట్లాడార‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని..దాడికి కూడా దిగారంటూ స్నేహ పోలీసుల‌కు వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలోనే స్నేహ చెన్నై లోని కణత్తూరు పోలీసు స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. ఇక స్నేహ ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇదిలా ఉండ‌గా సినిమాల్లో హీరోయిన్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న స్నేహ ప్ర‌స్తుతం విభిన్న పాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news