రూ. 20 కోసం కన్న తల్లిని చంపేసిన కొడుకు..!

-

అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిస్వార్థ ప్రేమ తల్లిది మాత్రమే. ఎంత కష్టం వచ్చినా సరే తల్లి ఆ కష్టాన్ని గట్టెక్కించడానికి ఆఖరి నిమిషం వరకు పోరాడుతుంది కానీ కన్నతల్లిని చంపిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. డబ్బు కోసం కొడుకులు తల్లిదండ్రులని చిత్రహింసలకి గురి చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇటువంటి వార్తలు మనకి కనబడుతూ ఉంటాయి. ఇటువంటి సంఘటన చూస్తుంటే గుండె తరుక్కు పోతుంది. ప్రాణాలకు ప్రాణం పెట్టి జన్మనిచ్చిన తల్లిని కొంతమంది దాడి చేస్తూ ఉంటారు.

తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కేశంపేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సుగుణమ్మ అనే ఒక మహిళ షాద్ నగర్ లో ఉంటుంది స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటోంది. శివకుమార్ అనే కొడుకు ఉన్నాడు. డబ్బులు కోసం తల్లిని వేధిస్తూ ఉండేవాడు. ఆదివారం రాత్రి 20 రూపాయల కోసం సుగుణమ్మతో గొడవపడ్డాడు. కొడుకు విచక్షణ సహనం కోల్పోయి డబ్బులు లేవని చెప్పినా తల్లి మీద దాడి చేశాడు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు. కొడుకు తీవ్రంగా కొట్టడంతో ఆమె గాయపడింది. ఆమెని తన చీరతోనే మెడకి గట్టిగా బిగించేసాడు ఊపిరాడకుండా చేశాడు ఆమె తెల్లవారుజామున సుగుణమ్మ చనిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news