తెలంగాణలో విషాదం..కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి మృతి

-

 

తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పిక్క కనిపిస్తే చాలు కుక్కలు వెంటపడుతూ పీక్క తింటున్నాయి. వీధి కుక్కల దాడిలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది మరణించారు. తాజాగా కుక్కల దాడి లో చిన్నారి ప్రాణాలు వదిలాడు.

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లడికి చెందిన నిశాన్ష్ (5) డిసెంబర్ 25న తాతయ్యతో కలిసి పొలానికి వెళ్ళాడు. తాత ఇచ్చిన ఫోన్లో ఆడుకుంటుండగా కుక్క బాలుడిపై దాడిచేసి, తీవ్రంగా గాయపరిచింది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొన్ని రోజులకు డిశ్చార్జ్ కాగా, రెండురోజుల క్రితం వాంతులు చేసుకున్నాడు. నిన్న హైదరాబాద్ లోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news