తండ్రి ఉద్యోగం కోసం తండ్రినే చంపేసాడు…!

-

తన తండ్రి ఉద్యోగం కోసం, జార్ఖండ్ రామ్‌గర్ జిల్లాలో ఒక యువకుడు తన తండ్రిని చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 55 ఏళ్ల తండ్రి, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సిసిఎల్) ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇది ప్రభుత్వ రంగ అండర్‌టేకింగ్ (పిఎస్‌యు) సంస్థ. మృతుడు కృష్ణ రామ్ హెడ్ సెక్యూరిటీ గార్డుగా పోలీసులు చెప్పారు. జిల్లాలోని బర్కకనాలోని సిసిఎల్ సెంట్రల్ వర్క్‌షాప్‌ లో అతను విధులు నిర్వహిస్తున్నాడు.

గురువారం ఉదయం అతన్ని గొంతు కోసి కొడుకే చంపాడు. రామ్ యొక్క 35 ఏళ్ల పెద్ద కుమారుడు బుధవారం రాత్రి గొంతు కోసి చంపాడని సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్డిపిఓ) ప్రకాష్ చంద్ర మహోతో శనివారం విలేకరుల సమావేశంలో చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తండ్రిని చంపింది అతని పెద్ద కుమారుడు అని చెప్పారు. సిసిఎల్ నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి తన సర్వీస్ టైం లో మరణిస్తే చట్టబద్దంగా ఆధారపడిన కుటుంబానికి ఉద్యోగం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news