లోక్ సభ కి పోటీ చేయకపోవడానికి కారణం ఇదే: సోనియా గాంధీ

-

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుండి రాజ్యసభ ఎన్నికలు బరిలోకి దిగారు. బుధవారం నాడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సమక్షంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. లోక్సభ కి కాకుండా రాజ్యసభ కి నామినేషన్ వేయడానికి గల కారణాన్ని ఆమె చెప్పారు. పెరుగుతున్న వయసు ఆరోగ్య సమస్యల కారణంగానే తను వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని రాజ్యసభ కి నామినేషన్ వేసినట్లు చెప్పారు.

ఈ నిర్ణయం ద్వారా నేరుగా మీకు సేవ చేసే అవకాశం నాకు లభించదు. కానీ కచ్చితంగా నా హృదయం ఆత్మ ఎప్పుడూ మీ వెంటే ఉంటాయని సోనియా గాంధీ అన్నారు ఇంతకుముందు 2019 ఎన్నికల సమయంలో ఇవే చివరి లోక్సభ ఎన్నికలు అని ఆమె అన్నారు ప్రస్తుతం రాయబరేలి నుండి లోక్సభ కి ప్రాతినిథ్యం వహిస్తున్న సోనియా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ తో ముగియనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version