T20 World Cup 2024 : నేపాల్ పై ఒక్క రన్ తేడాతో సౌతాఫ్రికా గెలుపు

-

టీ-20 వరల్డ్ కప్ లో ఎప్పుడూ చూడని ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సారి మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్ దశలోనే నిష్క్రమించాయి. ఎవ్వరూ ఊహించని విధంగా అమెరికా పాకిస్తాన్ పై విజయం సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. మరోవైపు అప్గానిస్తాన్ సూపర్ 8కి చేరుకోవడంతో న్యూజిలాండ్ ఇంటిదారి పట్టక తప్పలేదు.

తాజాగా నేపాల్ పై సౌతాఫ్రికా కేవలం ఒకే ఒక్క రన్ తేడాతో విజయం సాధించడం గమనార్హం. తొలుత ప్రొటీస్ టీమ్ 115/7 స్కోరు చేయగా.. ఒకానొక దశలో నేపాల్ గెలిచే విధంగా కనిపించింది. కానీ చివరి ఓవర్ లో 8 పరుగులు చేయాల్సి ఉండగా.. కేవలం 6 పరుగులు మాత్రమే చేసింది. ముఖ్యంగా చివరి బంతికి గుల్సన్ జా రనౌట్ కావడంతో నేపాల్ ఇన్నింగ్స్ 114/7 వద్ద ముగిసింది. దీంతో సౌతాఫ్రికా ఒక్క రన్ తేడాతో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news