గుడ్ న్యూస్ : ఎస్పీ బాలుకి కరోనా నెగటివ్

-

అన్నట్టు గానే ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ శుభవార్త చెప్పాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్ వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాల సుబ్రహ్మణ్యంకు కరోనా సోకడంతో ఆయన గత కొన్ని రోజులుగా విదేశీ వైద్యుల సంరక్షణలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఎస్పీబీకి కరోనా నెగటివ్‌ నిర్ధరణ అయ్యిందని చెబుతున్నారు. అయితే నాన్న ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని మరో వారంలో నాన్న పూర్తిగా కోలుకుంటారని చరణ్ పేర్కొన్నారు. ఆయనకి మెలుకువ వచ్చిందన్న చరణ్ ఆయన ఐ-పాడ్‌లో క్రికెట్, టెన్నిస్ మ్యాచ్‌ లు చూస్తున్నారని పేర్కొన్నారు. అంతే కాదు త్వరలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లు చూసేందుకు కూడా ఆయన ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇక ఆయనకు ఫిజియోథెరపీ కొనసాగుతోందని ఎస్పీ చరణ్ పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news