గుడ్ న్యూస్ : మెరుగుపడ్డ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం..!

-

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారి నుంచి క్రమంగా కోలుకుంటున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. నిన్నటితో పోల్చితే తన తండ్రి ఆరోగ్యం మెరుగైందని, ఆయన ఊపిరితిత్తులపై కరోనా ప్రభావం తగ్గుతోందని వివరించారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు చరణ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. మరోవైపు ఎస్పీ బాలు ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నట్టు ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

అయితే ఎంతో మంది ప్రముఖులు, సామాన్యులు బాలసుబ్రహ్య‌ణ్యం ఆరోగ్యంపై స్పందించారు. ఆయన త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. అయితే కరోనా బారిన పడ్డ బాలసుబ్రహ్య‌ణ్యంని చెన్నైలోని ఓ కార్పోరేట్ హాస్పిటల్‌లో చేర్చారు. అయితే అక్కడ ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఐసీయూకి తరలించారు. ఇక అప్పటినుంచి ఆయనకి లైఫ్ సపోర్ట్‌ తో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version