మరో షాక్…దూరం కానున్న సీనియర్ ఆటగాళ్లు…

-

ప్రస్తుతం భారత్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. పర్యటనలో భాగంగా సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని ఇండియా టి20 సిరీస్ 1-1 తో సమం చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ముగియడంతో డిసెంబర్ 17వ తేదీన వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ వన్డే సిరీస్ కి సీనియర్ ప్లేయర్ దీపక్ చాహార్ దూరం కాగా టెస్ట్ సీరీస్ కి ఇండియా స్టార్ బౌలర్ షమీతో దూరం కానున్నారు.

 

గత నెల జరిగిన వన్డే ప్రపంచకప్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమీ టెస్ట్ సిరీస్ కి గాయం కారణంగా దూరం అయ్యాడు. ఇటీవల జరిగిన ఫిట్నెస్ టెస్టులో అతడు విఫలము అయ్యాడు కానీ అతని స్థానంలో మరే ఇతర ప్లేయర్ని బీసీసీఐ ప్రకటించలేదు.అలాగే తన తండ్రి అత్యవసర వైద్య పరిస్థితిని ఎదుర్కొంటున్నందు వల్ల వన్డే సిరీస్ కి అందుబాటులో తాను ఉండలేనని దీపక్ చాహర్ ఆల్రెడీ తెలిపడంతో అతని స్థానంలో బిసిసిఐ ఇంకో ప్లేయర్ని సెలెక్ట్ చేసింది. అతడి స్థానంలో ఆకాశ దీప్ ని సెలెక్టర్ల కమిటీ ప్రకటించింది. ఆకాష్ జట్టులోకి త్వరలోనే చేరబోతున్నారు. ఈ వన్డే సిరీస్ కి కేఎల్ రాహుల్ సారధ్య బాధ్యతలు వహిస్తున్నాడు. అలాగే ఈ వన్డే సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ మొదటి మ్యాచ్ మాత్రమే ఆడుతాడు మిగతా మ్యాచ్లో అతనికి రెస్ట్ ఇచ్చి అతనిని టెస్ట్ మ్యాచ్ కి సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news