ASIA CUP 2022: దుబాయ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెటర్లు

-

ఆసియా కప్ 2022లో వరుస విజయాలతో మంచి జోష్ లో ఉన్నారు టీం ఇండియా ఆటగాళ్లు. గ్రూప్ – ఏ లో భాగంగా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ గెలుపొందింది టీమిండియా. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండవ మ్యాచ్ లో హాంకాంగ్ ను 40 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా గ్రూపులో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఆదివారం రోజు సూపర్ 4 లో భారత్ తలపడనుంది.

ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కు ఇంకా చాలా సమయం ఉండడంతో టీమిండియా క్రికెటర్లు దుబాయ్ లోని బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, చాహల్, హార్దిక్ పాండ్యా, ఇలా జట్టు మొత్తం దుబాయ్ లోని బీచ్ లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news