యువరాజ్ ఆటకు భయపడిన ఆస్ట్రేలియా, ఏం ప్రశ్న అడిగిందో చూడండి…!

-

టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్… డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ యువరాజ్ సింగ్ జట్టు విజయాల్లో ఏ స్థాయిలో కీలక పాత్ర పోషించాడో అందరికి తెలిసిందే. అతని కెరీర్ లో ప్రధానంగా 2007 ప్రపంచకప్ తో పాటుగా 2011 ప్రపంచకప్ జట్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు.

ఈ రెండు టోర్నీల్లో అతని ఆట చరిత్రలో నిలిచిపోతుంది అనే మాట అక్షర సత్యం. అటు బౌలింగ్ లో కూడా ఆకట్టుకున్నాడు. తాజాగా అతను తన బ్యాటింగ్ గురించి ఒక కీలక విషయం చెప్పాడు. స్పోర్ట్స్ తక్‌తో జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో టీ 20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఒక సంఘటన యువి గుర్తు చేసుకున్నాడు.

ఆ సమయంలో ఆస్ట్రేలియా కోచ్ టిమ్ నీల్సన్ తన బ్యాట్‌లో ఫైబర్ ఉందా అని అడిగాడని అతను వెల్లడించాడు. “మ్యాచ్ జరిగిన మరుసటి రోజు, ఆస్ట్రేలియా కోచ్ ఫుడ్ కోర్టులో నా వద్దకు వచ్చాడు. నా బ్యాట్‌లో ఫైబర్ ఉందా అని అడిగాడు. ‘ఈ బ్యాట్ చట్టబద్ధమైనదా?’ అతను అడిగినట్టు వివరించాడు యువీ.

“అప్పుడు మ్యాచ్ రిఫరీ నా బ్యాట్‌ను తనిఖీ చేశాడన్నాడు… ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తన బ్యాట్ గురించి కూడా సరదాగా అడిగినట్లు చెప్పాడు. “తన పూల్ సెషన్లో, ఆడమ్ గిల్‌క్రిస్ట్ నా బ్యాట్‌ను ఎవరు తయారు చేస్తారని కూడా అడిగారు. “కాబట్టి మ్యాచ్ రిఫరీ నా బ్యాట్‌ను తనిఖీ చేశాడని చెప్పాడు.

కానీ నిజాయితీగా, ఆ బ్యాట్ నాకు చాలా ప్రత్యేకమైనదని… నేను ఎప్పుడూ అలాంటి బ్యాట్‌తో ఆడలేదన్నాడు యువీ. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కేవలం 30 బంతుల్లో 70 పరుగులు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news