IPL 2024: ధోనీ బాదిన సిక్సర్ వల్లే..RCB గెలిచింది !

-

IPL 2024: ధోనీ బాదిన సిక్సర్ వల్లే..RCB గెలిచిందంటున్నారు. నిన్న మ్యాచ్ లో ధోని 110 మీటర్ల సిక్స్ ఆర్సిబి గెలుపునకు కారణమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పటివరకు తడిగా ఉన్న బంతి గ్రౌండ్ బయటకి వెళ్లడంతో అంపైర్లు బెంగుళూరు బౌలర్ యశ్ దయాల్ కు కొత్త బంతిని ఇచ్చారు.

Best Thing Was MS Dhoni Hitting Six Outside the Ground

ఆ బాల్ పై గ్రిప్ దొరకడంతో దయాల్ గొప్పగా బౌలింగ్ చేశారు. రెండో బంతికే ధోనిని అవుట్ చేసిన అతడు….ఆ తర్వాత నాలుగు బంతుల్లో కేవలం ఒక్క పరుగే ఇచ్చి ఆర్సిబిని ఆనందంలో ముంచెత్తారు. కాగా ఆర్సీబీ-చెన్నై మ్యాచ్ లో శనివారం రోజున బెంగళూరు అద్భుత విజయం సాధించింది. ఈ ఆటలో కీలకమైన ధోనీ వికెట్ గురించి బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ మాట్లాడాడు. ఆర్సీబీ ఆటగాడు యశ్‌.. కీలకమైన ధోనీ వికెట్‌ను పడగొట్టాడు.

అక్కడ నుంచి బెంగళూరు విజయం వైపు కొనసాగింది. ఆ ఓవర్‌లో కేవలం 7 పరుగులే ఇచ్చిన యశ్‌.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ప్రదర్శన చేసినప్పటికీ యశ్‌కు కాకుండా.. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేసిన డుప్లెసిస్‌కు (54) అవార్డు దక్కింది. మ్యాచ్‌ అనంతరం దానిని యశ్‌కు అంకితం చేస్తున్నట్లు డుప్లీ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news