Team India: షమీకి ఎదురుదెబ్బ.. భార్యకు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు

-

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి బిగ్ షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి కోల్కత్తా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహమ్మద్ షమీ తో విడిపోయిన భార్య హసీన్ జహాన్ కు ప్రతినెల లక్ష 30 వేలు చెల్లించాలని కోల్కత్తా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అందులో 50వేల రూపాయలు హసీనా జహాన్ కు వ్యక్తిగత భరణం కింద… మిగిలిన 80 వేల రూపాయలు ఆమెతో ఉంటున్న వారి కుమార్తె పోసిన ఖర్చు నిమిత్తం కేటాయించడం జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే నెలవారి భరణం లక్ష 30 వేలుగా కోర్టు ఆదేశాలకు కృతజ్ఞతలు తెలిపిన జహాన్… భరణం ఎక్కువ మొత్తం ఉంటే తాను ఉపశమనం పొందుతానని పేర్కొంది. అయితే కోల్కత్తా కోర్టు తీర్పుపై క్రికెటర్ మహమ్మద్ షమీ ఇంకా ఎలాంటి కామెంట్ చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news