సుశాంత్ చెప్పినట్టు చేసిన ధోనీ…?

-

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కి శాశ్వతంగా వీడ్కోలు పలకడం ఆయన ఫాన్స్ కి కాస్త కష్టంగానే ఉంది. దాదాపు 16 ఏళ్ళ పాటు టీం ఇండియాకు మహీ సేవలు అందించాడు. మూడు ఫార్మాట్లలో కూడా టీం ఇండియాకు ధోనీ అన్ని విధాలుగా తన బాధ్యతలతో మంచి విజయాలు అందించాడు. గత ఏడాది టీం ఇండియా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత ధోనీ ఎప్పుడు తప్పుకుంటారు అనే ప్రశ్నలు వినిపించాయి.MS Dhoni Fan Pays Heartwarming Tribute to Sushant Singh Rajput ...

ఇప్పుడు మహీ అనూహ్యంగా సోషల్ మీడియాలో ప్రకటన చేసి వెళ్ళిపోయాడు. అయితే మహీ అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పే విషయాన్ని బాలీవుడ్ యువ దివంగత హీరో సుశాంత్ సింగ్ ఒక సందర్భంలో చెప్పాడు. ధోనీ జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమాలో ధోనీ పాత్రలో నటించిన సుశాంత్ సినిమా ప్రమోషన్ లో ఒక వ్యాఖ్య చేసాడు. సరైన సమయంలో ధోనీ త‌న రిటైర్మెంట్‌పై నిర్ణ‌యం తీసుకుంటార‌ని, ధోనీ చాలా కాలంగా భారతదేశానికి సేవ చేస్తున్నారని, అందుకే రిటైర్మెంట్ గురించి నిర్ణయించుకునే హక్కు అత‌నికి మాత్రమే ఉందని నమ్మినట్టు చెప్పాడు సుశాంత్.

Read more RELATED
Recommended to you

Latest news