అహ్మదాబాద్​ వేదికగా భారత్​-పాక్​ మ్యాచ్​.. 11 వేల మంది సిబ్బందితో పటిష్ఠ భద్రత

-

వరల్డ్​ కప్​ 2023లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ భారత్-పాకిస్థాన్ మధ్యే జరుగుతుంది. ఈ మ్యాచ్​కు గుజరాత్​.. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. అక్టోబర్ 14వ తేదీన జరిగే ఈ మ్యాచ్​కు అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్​ రావడంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. 11వేల మంది సిబ్బంది ఈ వేదిక వద్ద పహారా కాయనున్నారు.

అహ్మదాబాద్ నగరాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నామని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అహ్మదాబాద్​ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. స్థానిక పోలీసులు, హోమ్ గార్డులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్- ఎన్ఎస్‌జీ కమాండోలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్​ను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. 7000 వేల మంది పోలీసులతో పాటు మరో 4000 మంది హోంగార్డులను మోహరించినట్లు వివరించారు.

లక్ష మందికి పైగా ప్రేక్షకులు ఈ మ్యాచ్ చూడటానికి వస్తున్న నేపథ్యంలో.. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ (సీబీఆర్​ఎన్) వంటి దాడులు జరిగినా వెంటనే స్పందించేలా భద్రత కల్పిస్తున్నట్లు జీఎస్ మాలిక్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news