ఐపీఎల్ 2023:”డు ఆర్ డై” మ్యాచ్ లో బెంగుళూరు బ్యాటింగ్ !

-

ఈ రోజు ముంబై లో జరుగుతున్న కీలక మ్యాచ్ లో హోమ్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో ముంబై గెలిచినా అయిదు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లు ఛేజింగ్ లో గెలిచినవే కావడం విశేషం. అందుకు ఇది ముంబైకి ఒక అడ్వాంటేజ్ కానుంది. ఇక మొదటి బ్యాటింగ్ చేయనున్న బెంగుళూరు తుది జట్టులో ఒక్క మార్పును చేసింది.. స్పిన్నర్ కర్ణ శర్మ కు బదులుగా బౌలర్ విజయకుమార్ వైశాఖ్ ను జట్టులోకి తీసుకుంది. అదే విధంగా కేదార్ జాదవ్ కు బదులుగా హర్షల్ పటేల్ ను తీసుకుంది. ఇక ముంబై జట్టులో ఏకంగా మూడు మార్పులను చేసింది.. క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తికేయ మరియు బెహ్రఎండార్ఫ్ లకు అవకాశం ఇచ్చింది.

ఇక గత మ్యాచ్ లో విఫలం అయినా స్టబ్స్ , గోయల్ , అర్షద్ ఖాన్ లను తప్పించింది. కాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ తిలక్ వర్మ ఇంకా జ్వరం నుండి కోలుకోకపోవడంతో బెంచ్ కే పరిమితం అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version