IPL 2022 : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ధోని

-

ఐపీఎల్‌ 2022లో రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ కు చేరుకుంది. చెన్నై తో బ్రబోర్న్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన రాజస్థాన్‌ రాయల్స్.. ప్లే ఆఫ్స్‌ బెర్తు ను ఫైనల్‌ చేసుకుంది. తాజా సీజన్‌ లో ఇప్పటికే గుజరాత్‌, లక్నో జట్లు ప్లే ఆఫ్స్‌ కు చేరగా.. మూడో బెర్తును రాజస్థాన్‌ భర్తీ చేసింది.

ఇక మిగిలిన ఆఖరి బెర్తు కోసం బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు రేసులో ఉన్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌ అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తన ఫ్యాన్స్‌ కు శుభవార్త చెప్పారు ఎంఎస్‌ ధోని. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ లో కూడా ఆడతానని స్పష్టం చేశాడు ఎంఎస్‌ ధోని.

కచ్చితంగా వచ్చే సీజన్‌ లో ఆడతా. ఎందుకంటే.. చెన్నైలో ఆడి.. అక్కడి అభిమాలనుకు థ్యాంక్యూ చెప్పకుండా వెళ్లడం సరికాదు. ముంబై తో నాకు మంచి అనుభవమే ఉంది. అయితే.. సీఎస్‌ కే అభిమానుల పట్ల అలా చేయకూడదంటూ ఆన్సర్‌ ఇచ్చారు ధోని. దీంతో ధోని ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news