IPL 2022 : ఈ నెల 30 నే రిటెన్ష‌న్ ప్ర‌క్రియ

-

ఈ నెల 30 నే ఐపీఎల్ జ‌ట్ల ఆట‌గాళ్ల రిటెన్ష‌న్ ప్ర‌క్రియ ఉంటుంద‌ని బీసీసీఐ అధికారులు తెలిపారు. న‌వంబ‌ర్ 30న సాయంత్రం 5 గంట‌ల కు రిటెన్ష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఈ ప్ర‌క్రియ ను స్టార్ స్పోర్ట్స్ తో పాటు హాట్ స్టార్ లో ప్ర‌త్యేక్ష ప్ర‌సారం కానుంది. కాగ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నెల లో మెగా వేలం ఉండే అవ‌కాశాలు ఉన్నాయి.

కాగ రిటెన్ష‌న్ ప్ర‌క్రియ కు సంబంధించి నియ‌మావ‌ళి బీసీసీఐ గ‌తం లో నే ప్ర‌క‌టించింది. ప్ర‌తి జ‌ట్టు న‌లుగురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకోవ‌చ్చు. అందులో ముగ్గురు స్వ దేశి ప్లేయ‌ర్లు ఉండాలి. అలాగే ఒక విదేశి ప్లేయ‌ర్ ఉండాలి. అలాగే ఐపీఎల్ 2022 లో కొత్త గా రెండు జ‌ట్లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ కొత్త జ‌ట్లు క‌నీసం ముగ్గురు ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఈ ముగ్గురి లో ఇద్ద‌రు స్వ దేశి ఆట‌గాళ్లు.. మ‌రొక‌రు విదేశి ఆట‌గాళ్లు ఉండాల‌ని బీసీసీఐ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news