IPL MI vs DC : ఉత్కంఠ పోరులో ముంబై పై ఢిల్లీ విక్ట‌రీ

-

ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజ‌యం సాధించింది. ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్.. చివ‌రికి ఢిల్లీ విజ‌యం సాధించింది. 178 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంత్ సేన మొదట్లో త‌డ‌ప‌డింది. ఓపెన‌ర్లు పృథ్వి షా (38), టిమ్ సీఫెర్ట్ (21) ప‌ర్వలేద‌నిపించినా.. మ‌న్ దీప్ సింగ్ (0), పంత్ (1), రోవ్ మన్ పావెల్ (0) వ‌రుస‌గా పెవిలియ‌న్ కు క్యూ క‌ట్టారు. ఈ స‌మ‌యంలో ఢిల్లీ విజ‌యం సాధించ‌డం క‌ష్టమే అనుకున్నారు.

కానీ ల‌లిత్ యాదవ్ ( 48 నాటౌట్ ) తో పాటు అక్షర్ ప‌టేల్ (38 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరికి తోడు శార్దుల్ ఠాకూర్ (11 బంతుల్లో 22) దాటిగా ఆడాడు. వీరి విధ్వంసక బ్యాటింగ్ కు భారీ స్కోరు కూడా చిన్న‌బోయింది. దీంతో ఢిల్లీ ఇంకా.. 8 బంతుల మిగిలి ఉండ‌గానే 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ముంబై బౌల‌ర్లు బ‌సిల్ థంపి 3 వికెట్లు తీసుకున్నాడు. మురుగ‌న్ అశ్విన్ 2, మిల్స్ ఒక వికెట్ పడ‌గొట్టారు. అంత‌కు ముంద ముంబై… కెప్టెన్ రోహిత్ (41), ఇషాన్ కిషాన్ (81) తో రాణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version