IPL 2022 : మళ్లీ కోహ్లీ అట్టర్ ఫ్లాప్.. రాజస్థాన్ పై బెంగళూరు ఓటమి

-

ఐపీఎల్ 2022 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ హైట్రిక్ విజయాన్ని అందుకుంది. నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తో జరిగిన మ్యాచ్ లో… రాజస్థాన్ రాయల్స్ ఏకంగా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు చేధించలేక పోయింది. చేతనలో కేవలం 115 పరుగులకే చాప చుట్టేసింది బెంగళూరు జట్టు.

దీంతో రాజస్థాన్ రాయల్స్ 29 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. బెంగళూరు బ్యాట్స్మెన్లలో మరోసారి విరాట్ కోహ్లీ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. కేవలం తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. పాటీ దార్ 16 పరుగులు, అహ్మద్ 17 పరుగులు, హసరంగ 18 పరుగులు, దినేష్ కార్తీక్ ఆరు పరుగులు, సిరాజ్ 5 పరుగులు మరియు హర్షల్ 7 పరుగులు చేసి వెనుదిరిగారు. బ్యాటర్ల అందరూ విఫలం కావడంతో రాజస్థాన్ సులభంగా విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version