ముంబయిపై రాజస్థాన్‌ ఘన విజయం.. 100 కొట్టిన బాదిన జైస్వాల్‌

-

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్ విజయ యాత్ర కొనసాగుతోంది. హోం గ్రౌండ్ లో ముంబయి ఇండియన్స్ తో జరిగిన పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (104*; 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) 100తో దూసుకెళ్లడంతో 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 18.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. మరో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (35; 25 బంతుల్లో 6 ఫోర్లు), కెప్టెన్‌ సంజు శాంసన్‌ (38*; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టారు. ఈ మ్యాచ్‌తో రాజస్థాన్‌ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించగా, ముంబయికిది ఐదో ఓటమి.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌లో రోహిత్ శర్మ (6), ఇషాన్‌ కిషన్ (10) పరుగులకే పెవిలియన్ చేశారు. తిలక్ వర్మ (65; 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు. నేహల్ వధేరా (49; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మహ్మద్‌ నబీ (23; 17 బంతుల్లో) ఫర్వాలేదని అనిపించాడు. రాజస్థాన్‌ పేసర్ సందీప్ శర్మ (5/18) ఆకట్టుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ 2, అవేశ్ ఖాన్‌, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news