T20 World Cup 2024: టీమిండియా ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ..!

-

ప్రస్తుతం క్రికెట్ లో ఐపీఎల్ సీజన్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ లో ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం రికార్డులను క్రియేట్ చేస్తోంది. 300 టార్గెట్ లక్ష్యంగా ఆడుతోంది. ఇదిలా ఉంటే.. మరికొద్ది రోజుల్లోనే టీ-20 వరల్డ్ కప్ జరుగనున్న విషయం తెలిసిందే.

టీ-20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో బీసీసీఐ జట్టు కూర్పు పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఓపెనర్లుగా పంపించడం పై ఆలోచనలు చేస్తోందట. ఐపీఎల్ లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడం పై హార్దిక్ పాండ్యా ఎంపిక ఆధారపడి ఉందని, గిల్ ను బ్యాకప్ ఓపెనర్ గా ఉంచాలని భావిస్తోంది. మరో సర్ ప్రైజ్ ఏంటంటే..? రాజస్థాన్ రాయల్స్ సెన్షేషన్ రియాన్ పరాగ్ ను వరల్డ్ కప్ కి ఎంపిక చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఏం జరుగుతుందనేది చూడాలి మరీ. 

Read more RELATED
Recommended to you

Latest news