టాస్ నెగ్గిన‌ కోహ్లి! బౌలింగ్ కు రెడీ

-

టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా ఈ రోజు టీమిండియా న‌మీబియాతో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ నెగ్గారు. దీంతో విరాట్ న‌మీబియా జ‌ట్టు ను ముందుగా బ్యాటింగ్ చేయ‌డానికి ఆహ్వానించాడు. కాగ టీమిండియా జట్టు ఇప్పిటికే సెమీస్ పోరు నుంచి వైదొలింగింది. దీంతో ఈ రోజు న‌మీబియా తో జ‌రుగుత‌న్న మ్యాచ్ నామ‌మాత్రంగా కానుంది.

అయితే న‌మీబియా ఇప్ప‌టికే ఆడిన నాలుగు మ్యాచ్ ల‌లో కేవ‌లం ఒక మ్యాచ్ లోనే విజ‌యం సాధించింది. దీంతో న‌మీబియా కూడా సెమీస్ నుంచి వైదొలింగింది. అయితే టీమిండియా కూడా న్యూజిలాండ్, ఆఫ్ఘ‌నిస్థాన్ మ్యాచ్ తోనే సెమీస్ అవ‌కాశాల‌ను చేజార్చు కుంది. నేటి మ్యాచ్ లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి స్థానం లో రాహుల్ చాహ‌ర్ తుది జట్టు లో ఉన్నాడు.

ఇండియా :
విరాట్ కోహ్లి (కెప్టెన్) కెఎల్ రాహుల్, రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్, రిష‌బ్ పంత్ ( కీప‌ర్), హ‌ర్ధిక్ పాండ్య‌, ర‌వీంద్ర జ‌డేజా, ర‌వీచంద్ర అశ్వీన్‌, రాహుల్ చాహ‌ర్‌, సిర‌జ్, బుమ్రా

న‌మీబియా :
గెర్హార్డ్ ఎరాస్మ‌స్ (కెప్టెన్), స్టీఫ‌న్ బార్డ్, మైఖేల్ వాన్, క్రెయింగ్ విలియమ్స్, జేన్ గ్రీన్ (కీప‌ర్) డేవిడ్ వైస్, జాన్ ఫ్రైలింక్, జే జే స్మీత్, జాన్ నికోల్ లాఫ్టి, రూబెన్ ట్రంపెల్ మాన్‌, బెర్నార్డ్ స్కోల్ట్జ్

Read more RELATED
Recommended to you

Latest news