WORLD CUP 2023: మొదటి మ్యాచ్ లోనే 5 వికెట్లతో తడాఖా చూపించిన షమీ !

-

వరల్డ్ కప్ షెడ్యూల్ లో భాగంగా నిన్న ఇండియా మరియు న్యూజిలాండ్ లు తలపడ్డాయి. మ్యాచ్ ఆద్యంతం ఇండియానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి మ్యాచ్ ను కైవసం చేసుకుంది. మొదట న్యూజిలాండ్ ను 273 పరుగులకే కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు సమర్థవంతంగా రాణించారు. ముఖ్యంగా వరల్డ్ కప్ లో నాలుగు మ్యాచ్ లు అనంతరం తుది జట్టులో చోటు సంపాదించుకున్న మహమ్మద్ షమీ ఈ మ్యాచ్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో వచ్చాడు. వచ్చి రాగానే వేసిన మొదటి బంతికే యంగ్ ను బౌల్డ్ చేసి తన ఆరంభాన్ని ఘనంగా చాటాడు. ఆ తర్వాత కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ లో మొత్తం అయిదు వికెట్లను తన ఖాతాలో వేసుకుని తానేమిటో ఇండియా టీం యాజమాన్యానికి మరోసారి నిరూపించారు.

ఇక ఈ వరల్డ్ కప్ లో ఇక మహమ్మద్ షమిని పక్కన పెట్టడానికి వీలు లేకుండా ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు. కాగా ఇక వరల్డ్ కప్ లో మిగిలిన నాలుగు మ్యాచ్ లలోనూ ఇదే విధంగా రాణించి ఇండియాకు టైటిల్ అందిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news