కివీస్ పై ఇండియా ఘనవిజయం… సెంచరీ మిస్ అయిన కోహ్లీ !

-

నిన్న ధర్మశాల వేదికగా జరిగిన హోరాహోరీ పోరులో ఇండియా జట్టునే విజయం వరించింది. ఇండియా న్యూజిలాండ్ ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో అయిదు వికెట్ల తేడాతో రోహిత్ సేన గెలుచుకుని వరుసగా అయిదు విజయాలతో పాయింట్ ల పట్టికలోనూ మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంది. మొదటగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్ లలో 273 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (130) సెంచరీ చేయగా, ఇతనికి రవీంద్ర (75)నుండి చక్కని సహకారం లభించింది. అనంతరం ఇండియా 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి ఆరు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను ముగించింది. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ వరుసగా రెండవ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. కోహ్లీ 95 పరుగుల వద్ద ఉండగా హెన్రీ బౌలింగ్ లో మిడ్ వికెట్ దగ్గర ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఇది చాలా బాధాకరం అని చెప్పాలి.. మిగిలిన వారిలో రోహిత్ ఒక్కడే 45 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇండియా అయిదు మ్యాచ్ లలోనూ గెలిచి 10 పాయింట్ లతో అగ్రస్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news