పాండ్యా బ్రదర్స్ తో కలిసి ధోని డ్యాన్స్.. వీడియో వైరల్

-

మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేకంగా పరిచయం అక్కర లేని పేరు. బహుశా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సచిన్ టెండూల్కర్ తరువాత అంతటి పేరు సంపాదించిన వ్యక్తి ఎంఎస్ ధోనీనే. ఇండియన్ క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా, ఆటగాడిగా మిస్టర్ కూల్ పేరు సంపాదించుకున్నారు. అయితే, ఈ మిస్టర్‌ కూల్‌ డ్యాన్స్‌ చేసిన ఇప్పుడు వైరల్‌ గా మారింది.

దుబాయ్‌ లో తన ఫ్రెండ్‌ బర్త్‌ డేకు మహి భాయ్‌ హాజరయ్యాడు. ఈ సందర్భంగా స్టార్‌ ర్యాప్‌ సింగర్‌ బాద్‌ షా పాటలు పాడుతుంటే, టీమిండియా ప్లేయర్లు పాండ్యా బ్రదర్స్‌, ఇషాన్‌ కిషన్ లతో కలిసి.. డ్యాన్స్ చేశాడు ధోని. ఈ వీడియోను ధోని భార్య సాక్షి సింగ్‌ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌ గా మారింది. అయితే, మైదానంలో కెప్టెన్‌ కూల్‌ గా చూసిన ఫ్యాన్స్‌ కు ఇదో రకమైన సర్‌ ప్రైజ్‌. దీంతో ఆ వీడియోను చూసిన క్రికెట్‌ ప్రియులు.. ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news