రెండో టెస్ట్ లో ఇంగ్లండ్ ఆలౌట్.. 143 పరుగుల ఆధిక్యంలో భారత్..!

-

విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు.  తనకు మాత్రమే సాధ్యమయ్యే సూపర్‌ యార్కర్లతో ఇంగ్లండ్‌ బ్యాటర్లకు పట్ట పగలే చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీ సహాయంతో 396 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు భారత బౌలర్లు గట్టి షాక్‌ ఇచ్చారు.

తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు సత్తా చాటారు. బుమ్రా 06, కుల్దీప్ 3 వికెట్లను తీయడంతో పర్యాటక జట్టు 55.5 ఓవర్లలో 253 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ప్రస్తుతం భారత జట్టు 143 పరుగుల ఆధిక్యంలో ఉంది.  ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (21) వికెట్‌ తీసి టీమ్‌ ఇండియాకు శుభారంభం అందించాడు కుల్‌దీప్‌ యాదవ్‌. ఆ తర్వాత జాక్ క్రాలే (76) అక్షర్ పటేల్‌కు వికెట్ అప్పగించాడు.  ఆ తరువాత హైదరాబాద టెస్ట్ లో 196 పరుగులు చేసిన పోప్ ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. అలా ఇంగ్లండ్ ఆటగాళ్లందరూ ఔట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news