England team : హైదరాబాద్ చేరుకున్న ఇంగ్లాండ్ ప్లేయర్స్

-

England team : ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండు జట్టు ఇండియాకు చేరుకుంది. ఈనెల 25 నుంచి తొలి టెస్టు జరగనున్న హైదరాబాద్ కు జట్టు సభ్యులంతా వచ్చారు. వారికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది.

England team arrives in Hyderabad ahead of Test series against India

కాగా, ఫిబ్రవరి 2 నుంచి విశాఖలో రెండో టెస్టు, 15వ తేదీ నుంచి రాజు కోర్టులో మూడో టెస్టు, 23 నుంచి రాంచీలో నాలుగో టెస్టు, మార్చి 7 నుంచి ధర్మశాలలో ఐదో టెస్టు జరగనుంది.

కాగా, భారత్ తో జరగనున్న 5 టెస్టుల సిరీస్ కు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ హ్యారీబ్రూక్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారు. అతని స్థానంలో డాన్ లారెన్స్ ను ఎంపిక చేసినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. బ్రూక్ జట్టులో లేకపోవడం ఇంగ్లాండుకు ఎదురుదెబ్బే. అతను ఇప్పటివరకు 12 టెస్టుల్లో 62.16 యావరేజ్, 91.76 స్ట్రైక్ రేటుతో 1,181 పరుగులు బాదారు. ఇందులో నాలుగు సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news