Keshav Maharaj : జై శ్రీరాం అంటూ వీడియో విడుదల చేసిన క్రికెటర్

-

భారత మూలాలున్న క్రికెటర్ కేశవ్ మహారాజ్ దక్షిణాఫ్రికా టీం తరఫున కొన్ని ఏళ్లుగా ఆడుతున్నారు. ఆ దేశంలో పుట్టి పెరిగినా….తన ధర్మాన్ని మాత్రం అతడు మరిచిపోలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా తనకు భక్తి భావం ఎక్కువేనని చాటి చెబుతున్నారు.

South Africa's Keshav Maharaj's wish on Ram Mandir inauguration
South Africa’s Keshav Maharaj’s wish on Ram Mandir inauguration

తాజాగా అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరామ్ అంటూ సందేశాన్ని ముగించిన వీడియోను అతడు విడుదల చేశారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ..అయోధ్య చేరుకున్నారు. మధ్యాహ్నం 12.05 నుంచి 12.55 గంటల వరకు ప్రాణప్రతిష్ఠలో పాల్గొనన్నారు ప్రధాని. బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొననున్న మోడీ.. మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రసంగిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 2.10 గంటలకు కుబేర్ తిలాను సందర్శించనున్నారు ప్రధాని మోడీ. మరోవైపు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news