BREAKING : బెంగళూరు కెప్టెన్ గా డుప్లెసిస్

-

ఐపీఎల్ లో ట్రోఫీ కోసం 2008 నుంచి ఎదురుచూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. ఇటీవల ముగిసిన ipl-2022 మెగా వేలంలో పక్కా వ్యూహంతో ఆటగాళ్లను కొనుగోలు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… ఈసారి ఎలాగైనా టైటిల్ ను గెలుచుకునేందుకు సన్నద్ధమైంది.

ఇందులో భాగంగానే ఇవాళ తమ కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసింది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ యాజమాన్యం. ఆర్సిబి కొత్త కెప్టెన్ గా దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ డుప్లెసిస్ ను ఎంపిక చేసింది ఆర్ సి బి. ఈ మేరకు ఓ ఈ వీడియో ను కూడా విడుదల చేసింది ఆర్సిబి. ఇక ఆర్సీబీ కెప్టెన్ గా… డుప్లెసిస్ ను ప్రకటించడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్ 2022 మార్చి 26 వ తేదీన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version