IPL 2023 : గేల్ రికార్డు సమం చేసిన విరాట్‌ కోహ్లీ

-

SRH తో మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన ఆర్సిబి స్టార్ ప్లేయర్ కింగ్ కోహ్లీ అరుదైన రికార్డును సమం చేశారు. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ 6 సెంచరీల రికార్డును సమం చేశాడు. కోహ్లీ 228 ఇన్నింగ్స్ లో ఈ మైలు రాయిని అందుకున్నారు.

తర్వాత స్థానంలో జాస్ బట్లర్ 5 సెంచరీలతో ఉన్నారు. కాగా, నాలుగేళ్ల తర్వాత కోహ్లీ ఐపిఎల్ లో సెంచరీ చేశారు. కాగా, నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్, ఆర్సిబి మ్యాచ్ లో మరో రికార్డు నమోదయింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు సెంచరీలతో అదరగొట్టారు. గతంలో ఒక మ్యాచ్ లో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓకే మ్యాచ్ లో ఇరుజట్లకు చెందిన ఆటగాళ్లు సెంచరీ చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ లో ఆర్సిబి ప్లేయర్ కోహ్లీ 100, ఎస్సారెస్ ప్లేయర్ క్లాసిన్ 104 పరుగులు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news