రేపే హెచ్​సీఏ ఎన్నికలు.. బరిలో నాలుగు ప్రధాన ప్యానల్స్

-

ఎట్టకేలకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈనెల 20వ తేదీన హెచ్​సీఏకు ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం ఆరు గంటల్లోపు హెచ్​సీఏ ఎన్నికల అధికారి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈసారి హెచ్​సీఏ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.

ఈ ఎన్నికల్లో మొత్తం నాలుగు ప్యానళ్లు తలపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కానీ.. ప్రధానంగా త్రిముఖ పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్‌ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 173 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.

నాలుగు ప్యానల్స్‌ పోటీ చేస్తుండగా.. ప్రధానంగా త్రిముఖ పోరు జరగనున్నట్లు సమాచారం. యునైటెడ్ మెంబెర్స్ ఆఫ్ హెచ్‌సీఏ, గుడ్ గవర్నెన్స్ ప్యానల్‌, క్రికెట్ ఫస్ట్ అనే ప్యానెల్స్‌ మధ్య రసవత్తర పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. యూనైటెడ్ మెంబెర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానల్‌కు అధికార బీఆర్ఎస్ మద్ధతు ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news