BREAKING : ఇవాళ రాత్రికే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా

-

BREAKING : ఇవాళ రాత్రికే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగం గానే నేడు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతల కీలక భేటీ జరుగనుంది. ఇప్పటికే తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీ చేరుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డాతో తెలంగాణ రాష్ట్ర నేతలు ప్రత్యేక భేటీలు జరుగనున్నాయి. తెలంగాణలో రూట్ మ్యాప్, అభ్యర్థుల ఖరారుపై ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డాతో తెలంగాణ రాష్ట్ర నేతలు చర్చలు జరుపనున్నాయి. అన్ని కుదిరితే ఇవాళ రాత్రికే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

కాగా, తెలంగాణ వెనుకబడిపోవడానికి కారణం కాంగ్రెస్ అన్నారు కిషన్ రెడ్డి. కర్ణాటకలో కాంగ్రెస్ డబ్బులు వసూలు చేస్తోంది. తెలంగాణ ఉద్యమ కారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ది. కర్ణాటక నుంచి వచ్చిన ఓ మంత్రి డబ్బులు వెదజల్లి ఎంజాయ్ చేస్తున్నారఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news