IND vs BAN: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

-

భారత్ – బంగ్లాదేశ్ మధ్య 3 మ్యాచ్ ల టి-20 సిరీస్ లో భాగంగా ఈరోజు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండవ టి-20 జరగనుంది. ఈ రెండో టి-20 లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ తొలి టీ-20 లో గెలిచిన విషయం తెలిసిందే.

దీంతో ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తుంది భారత్. మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్ లో గెలవాలని పట్టుదలతో ఉంది. కాగా బంగ్లాదేశ్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుండగా.. భారత జట్టు మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

భారత్ ప్లేయింగ్ 11: సంజూ శాంసన్ ( వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ ( కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్.

బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11: పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో ( కెప్టెన్), తౌహీది హర్దోయ్, మహమ్మదుల్లా, జాకీర్ అలీ, మెహదీ హాసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్ సాకీబ్, ముస్తఫిజూర్ రెహమాన్.

Read more RELATED
Recommended to you

Latest news