IND vs NZ: టీమిండియాకు షాక్.. టి-20 సిరీస్ నుంచి రుతురాజ్ ఔట్

-

వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా కి భారీ షాక్ తగిలింది. రేపటినుండి న్యూజిలాండ్ తో జరగనున్న టి20 సిరీస్ కి ముందు టీమిండియా యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ సిరీస్ కి దూరమయ్యాడు. రుతురాజ్ మణికట్టుకు గాయమైనట్లుగా తెలుస్తోంది. అతని స్థానంలో పృద్వి షా, లేదా రాహుల్ త్రిపాఠి తో పాటు మరికొందరిని బిసిసిఐ రాంచికి రప్పించింది. అయితే ఋతురాజ్ స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

గైక్వాడ్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమైనట్లు నేడు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఋతురాజును బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో రిపోర్ట్ చేయాలని సూచించినట్టు బీసీసీఐ ప్రతినిధి వెల్లడించారు. అతడు మనికట్టు గాయం బారిన పడడం ఇటీవల కాలంలో ఇది రెండవసారి. గతేడాది శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ నుంచి కూడా ఋతురాజ్ మణికట్టు గాయం కారణంగా తప్పుకున్నాడు. రేపు రాంచి వేదికగా భారత్ – కివీస్ జట్లు రాత్రి 7 గంటలకు అమీ తుమీ తేల్చుకోనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version