IND VS WI : వెస్టిండీస్‌పై భారత్ విజయం…3-1తో సిరీస్‌ కైవసం

-

వెస్టిండీస్ తో ఐదు టి20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సొంతం చేసుకుంది. టీమిండియా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తో ఈ విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 3-1 ఆదిత్యంతో తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టి20 లో 59 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఏకంగా 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రిషబ్ పంత్ 44 పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ 33 పరుగులు, సంజు సాంసన్ 30 పరుగులతో రాణించారు. దీంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. అనంతరం లక్ష చేదనకు దిగిన వెస్టిండీస్ జట్టును టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా అక్షర పటేల్, ఆవేష్ ఖాన్, రవి బిస్నోయి తలో రెండు వికెట్లు తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news